నేటి నుంచి 3 రోజులు విశాఖలో సీఎం జగన్ పర్యటన

-

విశాఖ జిల్లాలో నేటి నుంచి మూడు రోజులు పాటు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో రెండు రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగనుంది. ఇందులో భాగంగానే, విశాఖ జిల్లాలో నేటి నుంచి మూడు రోజులు పాటు సీఎం జగన్ పర్యటించనున్నారని… విశాఖ పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

సీఎం జగన్‌ పర్యటన, GIS అతిథులు రాకతో విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని వివరించారు. ఇక నేటి సాయంత్రం ఎయిర్ పోర్టు నుంచి తాటిచెట్లపాలెం, తెలుగు తల్లి ఫైఓవర్, కురుపాం జంక్షన్ మీదుగా హోటల్ కు చేరుకోనున్నారు సీఎం జగన్. ఈ తరుణంలోనే, రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విశాఖ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు విశాఖ పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్‌.

Read more RELATED
Recommended to you

Latest news