రేవంత్ లాగా ఏపీలో రుణమాఫీ చేయండి – వైఎస్‌ షర్మిల

-

రేవంత్ లాగా ఏపీలో రుణమాఫీ చేయండి అంటూ వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. 15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో, సోనియా, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు. రైతు కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణం. ఇది రాహుల్ గాంధీ గారు ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజు. తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు అన్నారు.

cm revanth reddy ys sharmila

మరి నేడు, ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కారును డిమాండ్ చేస్తున్నాం. రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరు. సుమారు 2,45,554 రూపాయల రుణం ప్రతి రాష్ట్ర రైతు నెత్తి మీద కత్తిలా వేలాడుతోంది. గడచినా దశాబ్దంలో అటు కరువు, తుఫానులు, ఇటు పూర్తికాని ప్రాజెక్టులు, సర్కారుల నిర్లక్ష్యం, వెరసి రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయిపోయిందని ఆగ్రహించారు.. మరి డబుల్ ఇంజిన్ సర్కారు నడుపుతున్న మీరు, కేంద్ర సాయంతో ఎందుకు రుణమాఫీ చేయకూడదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలము. కూటమి సర్కారును అడుగుతున్నాం, రైతు రుణమాఫీ చేయండి, అన్ని విధాలుగా చితికిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రైతులకు చేయూతనివ్వండని కోరారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news