కుప్పకూలిన టీడీపీ సభ…వీడియో వైరల్‌

-

టీడీపీ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఏలూరు జిల్లా టిడిపి బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టిడిపి బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో చినరాజప్ప మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో చినరాజప్ప, మాగంటి బాబు, పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్ కింద పడిపోయారు.

పలువురు టిడిపి నేతలు గాయపడ్డారు. వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బలమైన ఈదురు గాలుల దెబ్బకు స్టేజి కుప్పకూలినట్లు చెబుతున్నారు. అక్కడ ఏం జరిగిందో అర్థం కాక కార్యకర్తలు షాక్ లోకి వెళ్లారు. వెంటనే పడిపోయిన టిడిపి నేతల్ని లేవదీశారు. చినరాజప్ప, మాగంటి బాబు, కొక్కిరిగడ్డ జయరాజుతో పాటు మరో ఇద్దరూ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వర్షం రావడంతో సభ కూడా అర్ధాంతరంగా ముగిసింది. నేతలు స్వల్ప గాయాలతో బయటపడడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news