రాజకీయాలలో గొడవలు సాధారణం – కొడాలి నాని

-

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాలు కాక రేపుతున్నాయి. మాచర్లలో టిడిపి – వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యల వల్లే మాచర్లలో హింస చోటు చేసుకుందని అన్నారు.

వైసిపి నేతలను బట్టలిప్పే కొడతానని చంద్రబాబు ప్రతి సభలో అంటున్నారని.. మాచర్ల టిడిపి నేతలు చంద్రబాబు మాటలను ఆదర్శంగా తీసుకుని ఉంటారేమో.. అందుకే అక్కడ గొడవ జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన మద్దతుదారులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. రాజకీయాలలో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణమేనని తెలిపారు. ఇలాంటి గొడవలు మొదటివి ఏమీ కావని.. ఇవే చివరి గొడవలు కూడా కాదు అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news