లోకేష్ పాదయాత్రలో జనాలు పోటెత్తాలనే యష్..జగన్ అదే ప్లాన్.!

-

టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం..నారా లోకేష్ వచ్చే జనవరి 27 నుంచి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రని సక్సెస్ చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలతో రెడీ అవుతున్నారు. ఇక పాదయాత్ర అంశాన్ని పక్కన పెడితే..తాజాగా లోకేష్..కే‌జి‌ఎఫ్ హీరో యష్‌ని కలిశారు. కన్నడతో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న యష్‌ని లోకేష్ కలవడంతో..ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

లోకేష్ పాదయాత్రకు మద్ధతు తెలిపేందుకే యష్ కలిశారని చెప్పి ప్రచారం మొదలైంది. అయితే వారు ఏదో కామన్ ఫ్రెండ్ ద్వారా జస్ట్ సరదాగా కలిశారు. అక్కడ రాజకీయం ఏమి లేదు. కానీ ఎవరికి వారు నచ్చిన విధంగా ఊహాజనిత కథనాలని ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.. “ పప్పు పాదయాత్రకు జనాలు పోటెత్తాలంటే పాన్ ఇండియా మూవీ హీరోలను రప్పించాలి. ఉ(య)ష్! వాళ్లు రాకపోతే? హోటళ్లు, షూటింగ్ స్పాట్లకు ఏ దిగ్గజ దర్శకుడి రిఫరెన్సుతోనో లేకేషే వెళ్లి కలవాలి. ఛార్టర్డ్ ఫ్లైట్లు, కోట్లల్లో పారితోషికం అరేంజ్ చేయాలి. ఇదీ బొల్లి నాయుడు స్కెచ్.” అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దారుణమైన విమర్శలు చేశారు.

అయితే వారు రాజకీయంగా కలిశారో లేదో ఎవరికి తెలియదు..ఒకవేళ మద్ధతు ఇస్తే ఇస్తారు..అది వారికి సంబంధించింది..కానీ దీనిపై కూడా సాయిరెడ్డి..లోకేష్, చంద్రబాబుని పర్సనల్ గా టార్గెట్ చేసి..పప్పు, బొల్లి నాయుడు అంటూ హేళన చేస్తూ కామెంట్ చేశారు. ఇక దీనికి టీడీపీ శ్రేణుల నుంచి కూడా కామెంట్లు వస్తున్నాయి.

జగన్ పాదయాత్రలో కూడా అదే చేసి ఉంటారని, పెద్ద యాక్టర్ల చేత స్క్రిప్ట్‌లు చేయించి..జగన్ ఏదో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని బిల్డప్‌లు ఇప్పించారని, అలాగే కొందరు హీరోలని పాదయాత్రలో కలిసేలా చేసి పక్కా స్క్రిప్ట్ ప్రకారం..ప్రజలని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టారని, అలాంటి స్క్రిప్ట్‌లు తెలుసు కాబట్టే ఇప్పుడు లోకేష్ అదే చేస్తున్నారని సాయిరెడ్డి కంగారు పడుతున్నారని, మళ్ళీ ఎక్కడ అలాంటి స్క్రిప్ట్‌లతో అధికారంలోకి వచ్చేస్తారో అని భయపడుతున్నారని కౌంటర్లు ఇస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news