సీఎం జగన్‌పై మరో దాడికి కుట్ర?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరో దాడికి కుట్రలు జరిగినట్లు స్పష్టం అవుతుంది. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై మరో దాడికి కుట్ర జరిగినట్లు వైసిపి కార్యకర్తలు అలాగే నేతలు అనుమానిస్తున్నారు. మద్యం తాగిరితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Conspiracy for another attack on CM Jagan

ఈ తరుణంలోనే… సీఎం జగన్ పై మరో కుట్ర చేశారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే పోలీసులు అలర్ట్ కావడంతో ఆ కుట్ర భగ్నమైందని అంటున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… దాడి చేసేందుకు రాయితో వచ్చాడా ? దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా మొన్న విజయవాడలో జరిగిన బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసిన సంగతి తెలిసిందే. రాయితో సీఎం జగన్ కంటిపైన కొట్టారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news