ఏపీలో కరోనా రికార్డ్ స్థాయి పరిక్షలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షల రికార్డ్ ప్రతీ రోజు కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరుగుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా పరిక్షల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు అనేది స్పష్టంగా చెప్పవచు. ప్రతీ రోజు కూడా 15 వేలకు పైగా కరోనా పరీక్షలను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్నారు. సిఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాల నేపధ్యంలో అధికారులు కరోనా పరిక్షల విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి.

ఇక ఏపీలో ఇప్పటి వరకు 10 లక్షల 50 వేల కరోనా పరీక్షలను చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా కరోనా పరీక్షలను ఈ స్థాయిలో చేసింది. సిఎం జగన్ ఉభయ గోదావరి సహా పలు జిల్లాలపై కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దృష్టి సారించాలి అని స్పష్టమైన ఆదేశాలను వైద్య శాఖ అధికారులకు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news