పవన్‌ కళ్యాణ్‌ కు క్రికెటర్ అంబటి రాయుడు కౌంటర్‌..!

-

గుంటూరు జిల్లా ఏటి అగ్రహారంలో పర్యటిస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు… పవన్‌ కళ్యాణ్‌ కు కౌంటర్‌ ఇచ్చాడు. ఆటో డ్రైవర్ యూనియన్ తో సమావేశమైన అంబటి రాయుడు….అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్య వ్యవస్థ, వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానన్నారు. ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని.. నేను చూసినంతవరకు ప్రభుత్వం పై వ్యతిరేకత లేదని తెలిపారు.

మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని.. వైసీపీ నాలుగేళ్ల ప్రభుత్వం లో రెండేళ్లు కరోనా కష్ట కాలం ఉంది … కరోనా తో ప్రపంచం అంత స్తంభించి పోయిందన్నారు. అలాంటి సమయం లో కూడా ఏపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసింది…క్షేత్రస్థాయిలో రైతుల కోసం పంట కొనుగోలు కేంద్రాలు,నాణ్యమైన విత్తనాల సరఫరా లో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయని వివరించారు.నా పరిధిలో వాటికి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేస్తాను..వాలంటీర్ వ్యవస్థ పై ప్రజలు సంతృప్తి గా ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news