అందుకే తమిళ్ లోనే మొదటి సినిమా చేశా – ఎమ్.ఎస్.ధోని..!

-

ప్రముఖ క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైలో తన సతీమణి సాక్షి ధోనితో కలిసి ఇటీవల సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ధోని ఎంటర్టైన్మెంట్ పతాకం పై సాక్షి ధోని నిర్మాతగా తొలి ప్రయత్నం గా తమిళంలో లెట్స్ గెట్ మ్యారీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హరీష్ కళ్యాణ్, నటి ఇవానా జంటగా నటిస్తుండగా నదియా, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా రమేష్ తమిళమని సంగీతాన్ని అందిస్తూ దర్శకుడిగా కూడా పరిచయం కాబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో ఒక స్టార్ హోటల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధోని మాట్లాడుతూ.. తమిళంలోనే తన మొదటి సినిమాను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో వెల్లడించారు.

ధోని మాట్లాడుతూ .. మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఇంట్లో బాస్ ఎవరన్నది అందరికీ తెలిసిందే. నా భార్య చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పారు. నేను క్రికెట్ క్రీడాకారుడిగా పరిచయమైంది చెన్నై నుంచి.. అదేవిధంగా నేను టెస్ట్ హైయెస్ట్ స్కోర్ చేసింది కూడా ఇక్కడే.. నేను నిర్మించిన తొలి చిత్రం కూడా తమిళ్ లోనే.. ఇకపోతే చెన్నై నాకు చాలా ప్రత్యేకమైన ప్రదేశం.. ఇంకా చెప్పాలి అంటే 2008లోనే ఐపిఎల్ క్రికెట్ ఆడినప్పుడే చెన్నై తోనే నేను అడాప్ట్ అయినట్లు తెలిపారు. అలా నాకు చెన్నైకి పరస్పర ప్రేమ కారణంగానే నా నిర్మాణ రంగం నుండి తొలి చిత్రాన్ని ఇక్కడే నిర్మించాను అంటూ ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news