BREAKING : హైకోర్టు లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు దారుణ హత్య..!

-

కర్నూలు లో దారుణంలో చోటు చేసుకుంది. ఏపీ హై కోర్టు లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కర్నూలు శివారు సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని భావిస్తున్నారు ఆవుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు.

ఈ 7 వ తేది నుంచి అదృశ్యమైన ఆవుల వెంకటేశ్వర్లు… చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ కనిపించకుండా పోయారు. దీంతో మహానంది పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో మహానంది పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. మృతుడు లాయర్ వెంకటేశ్వర్లు కర్నూలులోని టెలికం నగర్ లో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో వకాలత్ తీసుకొని కోర్టులో ఆవుల వెంకటేశ్వర్లు వాదిస్తున్నారు. అయితే.. ఆవుల వెంకటేశ్వర్లును ఎవరో చంపి ఉంటారని అందరూ నమ్ముతున్నారు. దీనిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news