వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక మలుపు

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసు సిబిఐ విచారణకు వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా రాసిన లేఖ వంటి అంశాలపై సిబిఐ సునీత, రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని ఇప్పటికే పలు దఫాలుగా విచారించిన సిబిఐ స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక అంతకు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు హాజరుకానందున ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇక మరోవైపు భాస్కర్ రెడ్డి డ్రైవర్ కి కూడా సిబిఐ నోటీసులు పంపించింది. సిబిఐ దూకుడు చూస్తుంటే త్వరలోనే ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news