ఏపీ సీఎం జగన్ కు మహేంద్ర సింగ్ ధోని సాయం..!

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విశాఖలో మరో అత్యధిక క్రికెట్ స్టేడియం ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇది సాకారమయ్యాక ప్రస్తుతం ఉన్న వైఎస్సార్ స్టేడియాన్ని క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దారని సూచించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చిందని… కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖలో క్రికెట్ అకాడమీల ఏర్పాటు దిశగా ముందుకు సాగాలని ఆదేశించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలపై గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీల నిర్వహణపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ఆటలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. చక్కటి స్ఫూర్తి నింపేలా పోటీలు సాగాలి. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికితీయడానికి ఇవి ఉపయోగపడాలి. పోటీలకు వచ్చే క్రీడాకారులకు భోజనం, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news