పిఠాపురంలో స్థలం కొన్న పవన్‌ కల్యాణ్‌

-

జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు సేవ చేసేందుకు తానెప్పుడూ కట్టుబడి ఉంటానని పవన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన అక్కడ స్థలం కొన్నారు. బుధవారం రోజున ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో పవన్‌కల్యాణ్‌ పేరున రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగ సభలో ప్రజలకు చెప్పారు పవన్ కల్యాణ్. ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్‌ విలువ రూ.15-16 లక్షల మేర ఉండగా.. మరో పదెకరాల తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news