చంద్రబాబు బరువుపై స్పందించిన డీఐజీ..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. నిన్న రాజమండ్రి జైలులో చంద్రబాబు భార్య భువనేశ్వరి ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు ఆరోగ్యం గురించి ఓ ట్వీట్ చేసింది. చంద్రబాబుకు ఎమర్జెన్సీ వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. జైలులో సకాలంలో వైద్యం అందించడం లేదని.. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారని తెలిపింది.

ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం పడే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని.. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. జైలులో పరిస్థితులు తన భర్త చంద్రబాబుకు తీవ్ర ముప్పు తలపెట్టేవిధంగా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అవసరమని ట్వీట్ ద్వారా తెలిపారు భువనేశ్వరి. తాజాగా జైలులో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news