దుర్గ గుడి ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కి ముహూర్తం ఖరారు !

-

దుర్గ గుడి ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కి ముహూర్తం ఖరారయింది. .వచ్చే నెల 4న దుర్గ గుడి ఫ్లై ఓవర్ ఓపెనింగ్ చేయనున్నట్టు సమాచారం. ఈరోజు దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను మంత్రి శంకర్ నారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ వచ్చేనెల 4న ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ కు చెందిన 13 వేల కోట్లకు రూపాయల పనులకు కేంద్ర‌మంత్రి గడ్కరీ శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అన్నారు.

6 వేల కోట్ల పై చిలుకు శంకుస్ధాపనలు జరగనున్నాయన్న ఆయన 5, 600 కోట్లకు పైగా ప్రారంభోత్సవ పనులు జరగనున్నాయని అన్నారు. ఇక అదే రోజున కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ ను వచ్చే నెల 4 న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని అన్నారు. దుర్గ గుడి ఫ్లై ఓవర్ దాదాపు పూర్తైందన్న ఆయన చిన్న చిన్న పనులను ముగించి 4న ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news