అనకాపల్లిలో ఇంజినీరింగ్ బస్సు బీభత్సం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

-

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటననే చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించిన ఘటన అనకాపల్లి పరిధిలోని కసింపేట మండలం బయ్యవరం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోజు మాదిరిగానే ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు కళాశాలకు బయలుదేరింది.

ఈ క్రమంలోనే బస్సు కసింకోట మండలం బయ్యవరం సమీపంలోకి రాగానే రోడ్డు పక్కనే ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను అనకాపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news