ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయాలి – టీటీడీ చైర్మన్ భూమన

-

తిరుపతి: శుక్రవారం మహతి ఆడిటరియంలో ప్రపంచ అవయవదానం దినోత్సవం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మా రెడ్డి. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు అవయవ దానం చేయాలని కోరారు. అవయవదానం చేయడం ద్వారా మరొకరికి కొత్త జీవితం ప్రసాదించిన వారు అవుతారని అన్నారు.

అవయవదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువ సంఖ్యలో ఉందని.. 130 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరికీ ఈ అవయవదానం పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఏపిలో అవయవదానంలో గుండె మార్పిడి చేస్తున్న ఏకైక హాస్పిటల్ తిరుపతి లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. తిరుపతి మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news