అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో అందరూ పనిచేయాలి – సోము వీర్రాజు

-

అమరావతి: నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బిజెపి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు మన్యంలో స్వాతంత్ర్య పోరాట కాంక్షను రగిలించారని అన్నారు.

 

అల్లూరి స్ఫూర్తితో అందరూ పని చేయాలని సూచించారు సోము వీర్రాజు. సీతారామరాజు కలలు ఇప్పుడు సాకారం అవుతున్నాయన్నారు. డ్రొన్లతో శత్రుదేశాలపై దాడి చేసే సాంకేతికతను సొంతం చేసుకున్నామన్నారు. పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద వర్థంతి కూడా ఇవాళేనని అన్నారు. కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య స్వాతంత్ర పోరాట స్పూర్తిని ఆకళింపు చేసుకుని జెండా రూపొందించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news