ప్రధాని మోదీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇదే..!

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన తెలంగాణలోని వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ కాజీపేట వ్యాగన్ ఓవన్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 8వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరిన ప్రధాని 9:45 గంటలకి హైదరాబాద్ లోని హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అనంతరం అక్కడి నుండి 9:50 గంటలకు హెలికాప్టర్ లో వరంగల్ కి బయలుదేరి 10:35కి అక్కడ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుండి సభా ప్రాంగణానికి వెళ్లే ముందు భద్రకాళి ఆలయాన్ని సందర్శిస్తారు ప్రధాని మోదీ. అనంతరం 12:10 నిమిషాల వరకు ప్రధాని ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12:15 గంటలకు తిరిగి వరంగల్ నుండి హైదరాబాద్ కి బయలుదేరుతారు. ఇక హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ పర్యటనకు వెళతారు.

Read more RELATED
Recommended to you

Latest news