TTD : చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

-

 

తిరుమలలో గత నెల 11న చిరుతదాడిలో మృతి చెందిన బాలిక లక్షిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందింది. టిటిడి రూ. 5 లక్షలు, అటవీశాఖ రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాయి. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలోని బాలిక నివాసంలో స్థానిక ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఈ మొత్తాన్ని చెక్ రూపంలో లక్షిత తల్లిదండ్రులకు అందించారు.

lakshitha
lakshitha

కాగా.. తిరుమల శ్రీవారి దర్శనార్థం.. నడక మార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతల సంచారం భయభ్రాంతులకు గురి చేస్తోంది. జూన్ 11 న కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో గాయపడి కోలుకోగా.. ఆగస్టు 11న లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించింది. అయితే తిరుమల నడకదారిలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news