అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

-

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో 15 మంది తీవ్రగాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.చెట్టు కొమ్మను తప్పించబోయి బస్సు లోయలో పడింది.  పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం. బస్సు దాదాపు 100 అడుగుల లోతులో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది వరకు ఉన్నట్టు సమాచారం. చోడవరం నుంచి పాడే వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

 

బస్సు లోయలోకి పడే సమయంలో చెట్ల కొమ్మల కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే పెద్ద లోయలో బస్సు పడితే బస్సులో ఉండేవారు అందరూ మరణించి ఉండేవారని స్థానికులు పేర్కొంటున్నారు.  ఆ ఏరియాలో నెట్ వర్క్ సరిగ్గా లేకపోడంతో సహాయక చర్యలు అందించడంలో కాస్త ఆలస్యం జరిగింది. ఇక ఈ  విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు, సిబ్బంది గాయాలైన వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయాలైన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news