స్పీకర్‌ సార్‌.. నా రాజీనామాను ఆమోదించండి: గంటా శ్రీనివాసరావు

-

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మరో సారి తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజుల నుంచి చాలా సైలెంట్‌ గా ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు… ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్‌ అయ్యారు. అయితే.. ఆయన ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకు కాకుండా తన రాజీనామా కోసం యాక్టివ్‌ అయ్యారు.

తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు.. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కు లేఖ రాశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాస రావు.. అప్పటి నుంచి పార్టీ ఎమ్మెల్యే గానే కొనసాగుతున్నా.. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు.. టీడీపీకి రాజీనామా చేసి… వైసీపీ లోకి వెళతారని వార్తలు కూడా వచ్చాయి.

కానీ అలాంటి వార్తలపై గంటా ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇవాళ తన రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు.. స్పీకర్‌ కు లేఖ రాశారు. త్వరగా ఆమోదించాలని ఈ సందర్భంగా కోరారు. కాగా.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news