జగన్ సర్కార్ కు భారీ ఊరట..రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు

-

ఏపీలో ఆర్-5 జోన్ పై జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలన్న ధర్మాసనం.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి పరిమితం కాదని.. రాజధాని ప్రజలందరిదన్నారు. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అన్న ధర్మాసనం… రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమేనని చెప్పారు. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదని.. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే.. భూములు ఇచ్చిన వారివి కావని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news