2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ – గుడివాడ అమర్నాథ్‌

-

విశాఖలో సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్‌. ఇవాళ మీడియాతో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ….పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అన్నారు. 2009లో మహాకూటమి వైఎస్సార్ మీద పోరాటం చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగింది…2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని వెల్లడించారు.

gudiwada amarnadh counter to kutami

అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలని ఉద్దేశంతోనే జనం పోటెత్తి ఓటేశారు….గతంలో వచ్చిన దానికంటే ఒక్క సీటైన ఎక్కువ వస్తుందని మా విశ్వాసం…..గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారన్నారు. ఏకపక్షంగా విజయం సాధిస్తామని.. వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరం అవుతుందని వివరించారు.

ఎన్నికల ఫలితాలు మూడు రాజధానుల కు రెఫరెండం అని చెప్పారు. కూటమి పార్టీలు ఫ్రస్టేషన్ లో హింసను ప్రేరేపించాయి….దానికి బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. విశాఖలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు….ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి పని చేస్తామని వివరించారు గుడివాడ అమర్నాథ్‌.

Read more RELATED
Recommended to you

Latest news