ముద్రగడ లేఖకు హరిరామ జోగయ్య కౌంటర్

-

పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ముద్రగడ రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య. పదవుల కోసం కాపులను ముద్రగడ పద్మనాభం జగన్ కి తాకట్టు పెట్టాడని విమర్శించారు. ఈ మేరకు హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. వారాహి యాత్ర ద్వారా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన ఆశిస్తుందన్నారు. చిన్న మంత్రి పదవులు ఆశించి రెడ్డి కులాధిపతికి కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్న నాయకులను చూసి మోసపోకండని అన్నారు.

ముద్రగడ ఇప్పటివరకు పెద్దమనిషి అనుకున్నానని.. పవన్ కళ్యాణ్ పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో నా నమ్మకానికి తూట్లు పొడిచిందన్నారు. తెర వెనుక వైసిపికి మద్దతు పలికి జనసేనకు ఓట్లు పడకుండా చేసింది ముద్రగడ కాదా..? అని ప్రశ్నించారు. లక్షలాదిమంది కాపులు లక్ష్యానికి చేరువవుతున్న నేపథ్యంలో దాన్ని చెడగొట్టేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం వెనుక జగన్ హస్తం లేదా..? అని నిలదీశారు హరి రామ జోగయ్య. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news