సుప్రీంకోర్టులో నేడు సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ..అవినాష్‌ అరెస్ట్‌ ?

-

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ కాగా.. ఎంపీ అవినాష్‌ రెడ్డి కూడా అరెస్ట్‌ అవుతాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలోనే.. సుప్రీం కోర్టులో ఇవాళ సునీతా రెడ్డి పిటిషన్ పై విచారణ జరుగనుంది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోనీ ధర్మాసనం విచారణ జరపనుంది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సునీత. మరి ఇవాళ సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news