ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో మరోసారి చుక్కెదురు..

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని ఇప్పటం గ్రామస్థులకు ఏపీ హై కోర్టు లో మరోసారి చుక్కెదురు అయింది. గతంలో14 మంది పిటిషనర్లకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు.. చేశారు ఇప్పటం గ్రామస్థులు.

అయితే, ఇప్పటం గ్రామస్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది ఏపీ హై కోర్టు ధర్మాసనం. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఇప్పటం గ్రామస్థులు. కాగా, రోడ్డు విస్తరణలో ఇప్పటంలో గ్రామంలో కొంత మంది ఇండ్లను ప్రభుత్వం కూల్చి వేసింది. అయితే, దీన్ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు, బాధిత కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news