టీచర్ల బదిలీలో భారీ దోపిడి.. మాజీ మంత్రి బొత్స పై ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు

-

ఏపీలో ఎన్నికల ముందు ప్రభుత్వం టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బదిలీల విషయంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. భార్యాభర్తల బదిలీల్లో భారీగా డబ్బులు చేతులు మారాయని ప్రచారం జరిగింది. అయితే తాము అధికారంలోకి వస్తే టీచర్ల బదిలీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పడు మంత్రి బొత్సపై ఏసీబీకి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

టీచర్ల బదిలీల్లో మాజీ మంత్రి బొత్స అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్కో టీచర్ నుంచి రూ.3 నుంచి 6 లక్షలు కొట్టేశారని పేర్కొన్నారు. ఇది బొత్స హయాంలోనే జరిగిన భారీ దోపిడీ అని వర్ణ వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే బదిలీలు చేశారని ఆరోపించారు. అవినీతి చేసిన మంత్రులను విడిచిపెట్టమని చెప్పారు. బొత్స అవినీతి బయటపెట్టి ఆయన్ను అరెస్ట్ చేసే వరకూ వదిలిపెట్టమని వర్ల రామయ్య హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news