నేను పుట్టిన నేల బాగుండాలనే పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగుతున్నా – పవన్ కళ్యాణ్

-

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్ లో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి పార్టీలో చేరారు 150మంది నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో సమర్థత ఉన్నవాళ్లు మరింతమంది రావాలని తన ఆకాంక్షగా చెప్పారు. నేరస్థులను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన ఉన్నవాళ్లు కావాలన్నారు.

వచ్చే నెల 5,6 తారికుల్లో రాజమండ్రీలో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ జెండా ఎగరకుడదన్నారు. ఏదైనా పదవి తీసుకుని లొంగిపోవడం, అమ్ముడు పోవడం చాలా సులువని అన్నారు. కానీ తాను పుట్టిన నేల బాగుండాలనే పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news