రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను – ఎమ్మెల్యే ముస్తఫా

-

గుంటూరు: ఎమ్మెల్యే ముస్తఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. నామీద ఎందుకు..? ఎవరు..? కక్ష కట్టారో అర్థం కావడం లేదన్నారు. తాను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు నిధులు అడగడం తప్పా..? అని ప్రశ్నించారు. లక్ష రూపాయల పని చేపించలేని ఎమ్మెల్యే పదవి నాకెందుకని అన్నారు.

అందుకే రాజకీయాలకు దూరంగా జరగాలి అనుకున్నానన్నారు. పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారం బోగస్ అంటూ కొట్టి పడేశారు. గతంలో తనకు పాతిక కోట్లు ఇస్తాం పార్టీ మారమన్నారని.. అప్పుడే నేను పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ నేను అడిగిన ప్రతి పని చేస్తున్నారని.. ఇప్పుడు ఎందుకు పార్టీ మారతానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news