ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ప్రధానంగా భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకో స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది  ప్రభుత్వం.

నియమించిన స్పెషల్ ఆఫీసర్లు : 

1.గుంటూరు- మల్లికార్జున 2. కృష్ణా-విజయరామరాజు, 3. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ- లత్కర్ శ్రీకేష్ 4. ఎన్టీఆర్ – జయలక్ష్మీ 5. ఏలూరు-శశి భూషణ్ 6. అనంతపురం 7. విశాఖపట్నం – సౌరభ్ గౌర్, 8. పార్వతీపురం మన్యం – కోన శశీధర్, 9. పశ్చిమ గోదావరి- బాబు.ఏ 10. శ్రీ సత్యసాయి – యువరాజ్ 11. చిత్తూరు- ఎం.ఎం. నాయక్, 12. కర్నూలు – హర్షవర్ధన్ 13. నంద్యాల – పోలా భాస్కర్ 14. శ్రీకాకుళం-ప్రవీణ్ కుమార్ 15. విజయనగరం-వినయ్ చంద్ 16. అన్నమయ్య- సూర్యకుమారి 17. బాపట్ల-ఎం.వీ. శేషగిరి బాబు, 18. అల్లూరి జిల్లా – కన్నబాబు 19. తిరుపతి – సత్యనారాయణ 20.పల్నాడు-రేఖారాణి 21. కాకినాడ-వీరపాండియన్ 22. నెల్లూరు-హరికిరణ్, 23. అనకాపల్లి-చెరుకూరి శ్రీధర్ 24. ప్రకాశం-గందం చంద్రుడు 25. కడప-కే.వీ.ఎన్. చక్రధర్ బాబు 26. తూర్పు గోదావరి-హరినారాయణ. 

Read more RELATED
Recommended to you

Latest news