జగన్.. వరద బాధితులకు పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు – హోంమంత్రి అనిత

-

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిల్వ ఉందని వెల్లడించారు. వరద బాధితులకు అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లను సరఫరా చేసామన్నారు.

అయితే బాధితులకు సహాయం చేస్తున్న తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు అనిత. తాము వరద బాధితులకు సహాయం చేస్తుంటే.. వైసిపి అధినేత జగన్ మాత్రం పేటీఎం బ్యాచ్ ని దింపి విష ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు కానీ.. బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నాడని మండిపడ్డారు.

ఇక ప్రకాశం బ్యారేజీలో కొట్టుకు వచ్చిన బోట్లపై అనుమానాలు ఉన్నాయన్నారు హోం మంత్రి అనిత. అలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా వినాయక మండపాలకు ఎలాంటి చలాన్లు విధించలేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news