ఏపీలో ఫ్లెక్సిల కలకలం..రాజధాని లేని ముఖ్యమంత్రి అంటూ !

-

ఏపీలో ఫ్లెక్సిల కలకలం రేపుతున్నాయి. విశాఖ మధురవాడ ఐటి హిల్స్ దగ్గర రాజకీయ ప్లేక్సిల కలకలం రేపుతున్నాయి. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి స్వాగతం అంటు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు కొంత మంది వైసీపీ అభిమానులు.

జనజగారణ సమితి పేరట వెలిశాయి ఈ ప్లేక్సిలు. రేపు ఐటి హిల్స్ అదాని డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ తరుణంలోనే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, రేపు సీఎం జగన్ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్, తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగుల పనుల నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం వైజాగ్ ఐటీ టెక్ పార్కును శంకుస్థాపన చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news