ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్..ఈ వస్తువులపై ఇకపై 28 శాతం GST !

-

ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్..ఈ వస్తువులపై ఇకపై 28 శాతం GST వసూలు చేయనుంది జగన్‌ సర్కార్‌. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్ క్యాసినోలను జిఎస్టి పరిధిలోకి తెస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే జూదం, గుర్రం పందెం, లాటరీలపై జిఎస్టి అమల్లో ఉంది. దీనికి అదనంగా ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్, క్యాసినోలను చేర్చింది.

ఏ రూపంలో నగదు లావాదేవీలు జరిగిన జీఎస్టీ వర్తిస్తుందని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్ పూర్తి విలువపై 28% జిఎస్టి వసూలు చేస్తున్నారు. అంతేకాదు భారత్ లో కార్య కలాపాలు సాగించే విదేశీ ఆన్లైన్ గేమింగ్ వేదికలకు ఇక జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పూర్తి బెట్టింగ్ విలువపై 28 శాతం జీఎస్టీని వర్తింపజేస్తూ సెంట్రల్ జిఎస్టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టిలో చేసిన సవరణలను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ తరుణంలోనే..ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్ క్యాసినోలను జిఎస్టి పరిధిలోకి తెస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news