జగన్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ – మంత్రి గుడివాడ అమర్నాథ్

-

జగన్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళుతున్నట్లు చెప్పారు. ఇన్వెస్టర్ సమ్మిట్ లో స్వాగత ప్రసంగం చేసిన గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి ఇక్కడి వనరులు, నైపుణ్య మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మేము ఊహించిన దాని కంటే నాలుగైదు రేట్లు పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయన్నారు అమర్నాథ్. పారిశ్రామికవేత్తల్లో మా ప్రభుత్వం పై ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం అన్నారు. రాజకీయ విమర్శలు చేసే వాళ్లకు ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు సమాధానం చెబుతాయన్నారు. విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ కు గ్రోత్ ఇంజన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news