జగన్ రాజకీయాలకు అనర్హుడు: నారా చంద్రబాబు

-

మహానాడు విజయం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఒంగోలులో మహానాడు విజయం ప్రజా విజయం అని అన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయింది అన్నారు. మహానాడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్ రాజకీయాలకు అనర్హుడు అని విమర్శించారు. ఇకపై విరామం వద్దని మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నెలకు రెండు జిల్లాల్లో పర్యటనలు చేయాలని నిర్ణయించారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజల భాగస్వామ్యంతో ఈ స్థాయి విజయం సాధ్యమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారం పై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందని చంద్రబాబు వెల్లడించారు. క్విట్ జగన్- సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. మహానాడు విజయవంతం లో భాగస్వాములైన నేతలకు అభినందనలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news