వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కు కరోనా.. ఫోన్ చేసిన జగన్

-

కర్నూల్ జిల్లా నంది కొట్కూరు ఎం ఎల్ ఏ తోగురు ఆర్థర్ కు కరోనా సోకింది. అర్థర్ తో పాటు ఆయన సతీమణి, మనమడికి కరోనా సోకడంతో వారంతా ప్రస్తుతం హైదరాబాద్ స్టార్ ఆసుపత్రి లో కరోన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ఇక హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో ఆర్థర్, కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్నారు.

ఇక ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 744864కి పెరిగింది. అలానే కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6159కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 47665 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి. ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 691040కు చేరింది. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలలో కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news