జగన్ షెడ్యూల్ లో ఆకస్మిక మార్పు.. హైదరాబాద్ పయనం !

-

ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. తిరుపతి నుంచి షెడ్యూల్ ప్రకారం ఆయన తాడేపల్లి బయలుదేరి వెళ్ళాలి. కానీ సీఎం నేరుగా హైదరాబాద్‌ వెళ్లనున్నారు. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న తన మామ ఈసీ గంగిరెడ్డిని పరామర్శించేందుకు జగన్ హైదరాబాద్ వెళ్తున్నారని వైసీపీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం. గంగిరెడ్డిని పరామర్శించిన అనంతరం సీఎం జగన్ తాడేపల్లి బయలుదేరి వెళ్తారని చెబుతున్నారు.

నిజానికి ముందు షెడ్యూల్ ప్రకారం సీఎం తిరుమల నుంచి నేరుగా రేణిగుంట అక్కడి నుండి గన్నవరం, అక్కడి నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళ్లాల్సి ఉంది. గంగిరెడ్డి అనారోగ్యం గురించి సమాచారం అందడంతో సీఎం తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఉదయం జగన్ శ్రీవారిని మరోమారు దర్శించుకున్నారు. అలానే కర్ణాటక సిఎం యడ్యూరప్పతో కలిసి ఆయన కర్ణాటక సత్రాల నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్నారు. అలానే తిరుమల నాదనీరాజనం మండపం వద్ద జరిగిన సుందరాకాండ పారాయణంలో కూడా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news