ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీ..

-

దేశ రాజధాని ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 కు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం ప్రాజెక్టుపై మెమొరండం ఇవ్వనున్నారు సీఎం జగన్. ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. కేంద్ర సహకారం కోరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విభజన హామీలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టునున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news