నేటి నుంచి “జగనన్నకు చెబుదాం” ప్రారంభం..టోల్ ఫ్రీ నంబర్ ఇదే

-

 

 

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం.. కోసం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నేడు ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైయస్ జగన్. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏ సమస్య పరిష్కారానికైనా ‘ జగనన్నకు చెబుదాం ’ ఉపయోగ పడనుంది. అంతేకాదు.. మీ సమస్యల పరిష్కారానికి సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్ 1902. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news