జగన్ గ్యాంగ్ సహజ వనరులను కూడా వదలడం లేదు – చంద్రబాబు

-

వైసీపీ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. నేడు సత్తెనపల్లిలో టిడిపి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆస్తులన్నింటినీ దోచుకుని సీఎం జగన్ ఒక్కడే లక్షల కోట్లు సంపాదించుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు.

మిగతా వారంతా పేదవాళ్లుగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారని అన్నారు. 2004లో జగన్ ఆస్తి ఎంత..? 2023 లో జగన్ ఆస్తి ఎంత..? అని నిలదీశారు. ఈడీ ఆస్తులు అటాచ్ చేసినప్పటికీ జగన్ లో మార్పు రాలేదని మండిపడ్డారు చంద్రబాబు. జగన్ గ్యాంగ్ రాష్ట్రంలో సహజ వనరులను సైతం వదలడం లేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news