కాకినాడ ఎంపీగా పోటీ చేయనున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు..!

-

కాకినాడ ఎంపీ గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను కోరారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ బరిలో జనసేనకి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతోె  ఆర్థికంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ తనకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతిపాదన చేశారు.

ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు జనసేనలో కాకినాడ ఎంపీగా పోటీ చేసేవారు ప్రస్తుతానికి ఎవరూ లేకపోవడంతో తాను పోటీ చేసేందుకు సిద్ధం అని జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. జనసేన నుంచి ఎవరు పోటీ చేసిన బయట నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడం తప్పదని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు చంటిబాబు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పాడు. ఇక వనరుల విషయంలో ఎటువంటి డోకా లేదని తన వియ్యంకుడు.. తనకంటే 100 రెట్లు ఆస్తి ఉన్నవాడని చెప్పాడు చంటిబాబు.

Read more RELATED
Recommended to you

Latest news