టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి నియామకం

-

టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన్ని టీటీడీ ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్‌ను ఇటీవలే వైద్యారోగ్య శాఖకు ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలోనే ఇప్పుడు జవహర్ రెడ్డి ని నియమించింది. అయితే ఈయన మరో రెండు రోజుల్లో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇంచార్జ్ ఈవోగా అడిషనల్ ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంత సడన్ గా మార్పు ఎందుకు అనేది తెలియాల్సి ఉంది. సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు చేబుతోన్నా తిరుమలలో జగన్ డిక్లరేషన్ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలకు సరయిన కౌంటర్ ఇవ్వలేదని భావిస్తున్న ప్రభుత్వం అనిల్ ని బదిలీ చేసిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 1990కి చెందిన ఈయన గతంలో వైఎస్ వద్ద కూడా కీలక పదవులలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news