జోగి రమేష్ ముందస్తు బెయిల్.. హైకోర్టు కీలక నిర్ణయం..!

-

జోగి రమేష్ ముందస్తు బెయిల్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వచ్చే నెల 3న తీర్పు ఇవ్వనుంది ఏపీ హై కోర్టు. అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటి పై జరిగిన దాడి కేసులో YCP నేత జోగి రమేష్ ముందస్తు బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్ పై ఏపీ హై కోర్టు చాలా రోజులుగా విచారణ జరుపుతూ వస్తుంది.

ఇక ఈరోజు కోర్టులో పిటిషన్ పై ఇరు వర్గాల తరపున వాదనలు ముగిసాయి. ప్రభుత్వం తరఫున లాయర్ సిద్ధార్థ లుత్రా తన వాదనలు ఈరోజు కోర్టులో వినిపించారు. అనంతరం జోగి రమేష్ తరపు లాయర్ వాదనలు కూడా విన్న ఏవో హై కోర్టు.. వచ్చే నెల మూడో తేదీన తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news