2024 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని సీట్లు గెలుస్తాం – మంత్రి కాకాణి

-

2024లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని ప్రకటించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎం.ఎల్.సి.ఎన్నికల పై నెల్లూరు లో వై.సీ.పి నేతల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత అధికారం లోకి రాక పోయినా నిలదొక్కుకొన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని… ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది ప్రాంతీయ పార్టీలు పెట్టి అధికారంలోకి రాకపోయేసరికి వాటిని మూసే శారని పేర్కొన్నారు.

పార్టీ కోసం కష్టపడ్డ వారికి సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని… టిడిపి ది కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రజా మద్దతు సీఎం జగన్ కే ఉందని.. ఎమ్మెల్సీ అభ్యర్థులకు అఖండ మెజారిటీ ఇచ్చి మరోసారి సత్తా నిరూపిద్దామన్నారు. 2024లో ఉమ్మడి నెల్లూ రు జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని.. అధికారం వచ్చాక సంక్షేమం ,అభివృద్ధి రెండుకళ్ళుగా సీఎం పాలన అందిస్తున్నారని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అందిస్తున్న సంక్షేమాన్ని వివరించండని.. ఎవరి సత్తా ఏంటో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చిన పారిశ్రామిక వేత్తలు నిరూపించారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news