ఈనెల 23న టిడిపిలోకి కన్నా లక్ష్మీనారాయణ

-

ఈనెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు కన్నా లక్ష్మీనారాయణ. అయితే తెలుగుదేశం పార్టీలో తన స్థానం ఏంటనే విషయంపై ఆయన మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో తన పాత్ర ఏంటి అనేది పార్టీ తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుందన్నారు. అంతేకాదు ఆ పార్టీ అధినేత నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకుంటానన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్న కన్నా లక్ష్మీనారాయణ.. ప్రజలు తిరగబడే పరిస్థితులు త్వరలోనే రానున్నాయన్నారు. సీఎం జగన్ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. అరాచక పాలనకు తోడు పోలీస్ వ్యవస్థ కూడా దిగజారిపోయిందన్నారు. అలాగే నిన్న టిడిపి కార్యాలయం, కార్యకర్తలపై జరిగిన దాడిని కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఇక రాజధాని తరలింపు జగన్ దోపిడీ కోసమేనని కుండబద్దలు కొట్టిన ఆయన.. అమరావతిని కాపాడుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజల పైనే ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news