త్వరలోనే టీడీపీలోని పెద్ద నాయకులు వైసీపీలో చేరతారు – కేశినేని నాని

-

త్వరలోనే టీడీపీలోని పెద్ద నాయకులు వైసీపీలో చేరతారని బాంబ్‌ పేల్చారు కేశినేని నాని. రానున్న రోజుల్లో నందిగామ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు ఎంపీ కేసినేని నాని. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఎంతో చిత్తశుద్ధి తో ఈ ప్రాంతం పట్ల ప్రేమతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎంపీ కేశినేని నాని.

సీఎం జగన్ సంక్షేమంతో పాటు చంద్రబాబు కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా అభివృద్ధి చేశాడని తెలిపారు. చంద్రబాబు నేను అమరావతి కట్టాను అమరావతి కట్ట అంటున్నాడు… రైతులు ఇచ్చిన పొలం 37 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి 21 ఎకరాలు కాకుండా ఆయన ఖర్చు పెట్టింది 10000 కోట్ల రూపాయలు అందులో కేంద్రం 1500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ స్కూలను కార్పొరేట్ స్కూల్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది మన పేద పిల్లలు కార్పొరేట్ స్కూలు పిల్లలకు పోటీగా నిలబడుతున్నారని వివరించారు. జగన్మోహన్ రెడ్డి దరిదాపులు కూడా చంద్రబాబు వచ్చే పరిస్థితి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news