పోలీసులకి తప్పిన పెనుముప్పు.. జస్ట్ లో ల్యాండ్ మైన్ మిస్

-

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు రచ్చ చేస్తున్నారు. మొన్న తెలంగాణాలో ఒకరిని చంపగా ఆ దళంలో కొంత మందిని పోలీసులు మట్టుబెట్టారు కూడా. తాజాగా ఈరోజు విశాఖ జిల్లా రాళ్లగడ్డ సమీపంలో పోలీసులను చంపాలనే ఉద్దేశంతో మావోయిస్టులు అమర్చిన మందు పాతరను చింతపల్లి పోలీసులు కొనుగొని దానిని డిస్మాండిల్ చేశారు. చింతపల్లి పోలీసుల నుంచి కోరుకొండ కమిటీ మిలీషియా సభ్యులు తప్పించుకుని పోలీసుల నుంచి ఎంతో కాలంగా తప్పించుకు తిరుగుతున్నారు.

అందులో కొర్రా నాగేశ్వరరావు, చిక్కుడు చిన్నారావు అనే ఇద్దరు సభ్యుల పేర్లు వాడుకుంటూ సంతలో వ్యాపారస్తులు నుంచి లబడంపల్లి గ్రామస్థుడు కోడా కృష్ణారావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని వద్ద ఒక లాండ్ మైన్, 2 డిటోనేటర్ లు, 50 మీటర్ల వైరు, నిప్పో బ్యాటరీలు, ప్రభుత్వ వ్యతిరేకమైన సాహిత్యాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులని టార్గెట్ చేసి ఫిక్స్ చేయాల్సి ఉండగా ముందే పోలీసులు పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news