ఏపీలో దారుణం.. ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

-

ఓ మహిళ తన ప్రియుడు వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో బ్లేడుతో అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలికిపురం మండలం గూడపల్లికి చెందిన ఒక వ్యక్తికి రాజోలు మండలం తాటిపాకకు చెందిన మరదలు వరసయ్యే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న తన ఇంట్లో ఎవరూలేరంటూ ఆమె అతడిని ఇంటికి పిలిపించుకుంది.

‘‘నువ్వు వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నావు.. నువ్వు నాకే దక్కాలి’’ అంటూ వాగ్వాదానికి దిగింది. కోపంతో బ్లేడుతో అతని మర్మాంగాన్ని కోసింది. తీవ్రగాయం కావడంతో బాధితుడ్ని రాజోలు ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి మెరుగైన వైద్యం నిమిత్తం అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ గణేశ్వరరావు సోమవారం తెలిపారు. కాగా బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news