జనసేన వాళ్లు నన్ను అవమానిస్తున్నారు – మహాసేన రాజేశ్

-

జనసేన వాళ్లు నన్ను అవమానిస్తున్నారని మహాసేన రాజేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి టార్చర్ భరించలేకపోతున్నా, నాకు చెప్పకుండా జనసేన నేతలు IVRS కాల్స్ చేస్తున్నారట అంటూ మహాసేన రాజేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లతో సర్వే చేస్తున్నారని తెలిసిందని ఆరోపణలు చేశారు. ఇది నాకు అవమానంగా ఉందని పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Mahasena Rajesh left the Assembly

ఇక ఇటీవలే అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం టిడిపి అభ్యర్థిగా పోటీ నుంచి అనుహ్యంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారుమహాసేన రాజేశ్. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని వ్యాఖ్యనించారు. కులరక్కసి చేతిలో బలైపోయానని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దని కోరారు మహాసేన రాజేశ్.

Read more RELATED
Recommended to you

Latest news